
- కెఎఫ్ఓఎన్ ప్రాజెక్టును ప్రారంభించిన పినరయి విజయన్
- 20లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్
తిరువనంతపురం : దేశంలో ఇంటర్నెట్ను ప్రాధమిక హక్కుగా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ సోమవారం ప్రతిష్టాత్మకమైన కెఎఫ్ఒఎన్ (కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్) ప్రాజెక్టును ప్రారంభించింది. డిజిటల్ పరంగా గల తేడాలను రూపుమాపి, రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువున గల కుటుంబాలనిుంటికీ ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యానిు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. దేశంలో సామాజిక, రాజకీయ అభివృద్ధికి కేరళ రాష్ట్రం ఇప్పటికే ఒక ప్రామాణికతను నిర్దేశించింది. తాజాగా దేశ డిజిటల్ పరివర్తనలో కూడా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 30వేలకుపైగా ప్రభుత్వ సంస్థలకు విశ్వసనీయమైన, భద్రతతో కూడిన ఇంటర్నెట్ అనుసంథానతను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా వుంది. పరిమితి లేని కమ్యూనికేషన్ సౌకర్యాలు అందించడం, ఇ-ప్రభుత్వ సేవలను మరింత సమర్ధవంతంగా అందచేయగలగడం కూడా లక్ష్యాలుగా వునాుయి. ఇది కాకుండా అదనంగా, ఆర్థికంగా వెనుకబడిన దాదాపు 20లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయానిు అందజేయడమే కాకుండా, అవసరమైన డిజిటల్ సాధనాలతో, అవకాశాలతో వారికి సాధికారతను కెఎఫ్ఒఎన్ కల్పిస్తోంది.
- ప్రజల కలల సాకారం : సిఎం విజయన్
ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రసంగించారు. కెఎఫ్ఒఎన్ ప్రారంభంతో ఎనాుళ్లగానో ప్రజలు కను కల నెరవేరిందని, పైగా ఎల్డిఎఫ్ ఇచ్చిన హామీ సాకారమైందని తెలిపారు. బాధ్యతాయుతమైన పాలనకు ఇది మరొక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. అనిు కుటుంబాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమనిచెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువున గల 20లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందుతుందని, మిగిలినవారికి సబ్సిడీ రేట్లకు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 17,412 ప్రభుత్వ కార్యాలయాలకు, 2105 ఇళ్లకుఇంటర్నెట్ ఇచ్చారు. కోవిడ్ అనంతర కాలంలో కొత్త రకమైన పనిసంస్కృతి ఆవిర్భవించిందని విజయన్ పేర్కొన్నారు. ఇంటి నుండి పనిచేయడం, ఇంటికి సమీపంలో పనిచేయడం, ఇంటికి దూరంగా పనిచేయడం వంటి వర్కింగ్ పద్ధతులు సర్వసాధారణమయ్యాయి. మన యువత ఇంటర్నెట్ నుండి మరినిు ప్రయోజనాలు పొందాలంటే దేశంలో ప్రతిచోటా మరింత మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందాలని అన్నారు. దీనికి కెఎఫ్ఒఎన్ ప్రాజెక్టు మంచి పరిష్కారమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.