Nov 21,2023 15:44

తిరువనంతపురం :  కేరళలోని ఓ స్కూల్‌లో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మాజీ విద్యార్థి కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం.. జగన్‌ అనే విద్యార్థి మంగళవారం ఉదయం 11 గంటలకు త్రిస్సూర్‌లోని వివేకోదయం స్కూల్‌లోకి ప్రవేశించాడు. మొదట క్యాంపస్‌లో ఎయిర్‌ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం తరగతి గదిల్లోనూ కాల్పులు జరపడంతో పాటు టీచర్లను బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి కాంపౌండ్‌ వాల్‌ పై నుండి దూకి పారిపోయేందుకు యత్నించాడు. అయితే అప్పటికే స్కూల్‌ను చుట్టుముట్టిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విద్యార్థి డ్రగ్స్‌ మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్నాడని అన్నారు.

అతను 2022లో తమ పాఠశాలలోనే ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశాడని వివేకోదయం స్కూల్‌ యాజమాన్యం వెల్లడించింది. అయితే తమ స్కూల్‌లో చేరడానికి ముందు మరో స్కూల్‌లో చదివేవాడని, అక్కడి టీచర్లతో కొన్ని సమస్యలు రావడంతో స్కూల్‌ మారినట్లు తెలిపింది.