Aug 23,2023 12:48

ఐజ్వాల్‌ :   నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి  కూలిన ఘటనలో 17 మంది కార్మికులు మరణించారు.  బుధవారం ఉదయం మిజోరాంలో ఈ ఘటన జరిగింది . రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు 21కిలోమీటర్ల దూరంలోని సైరంగ్  ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో పలువురు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. వంతెన కూలిపోయిన సమయంలో సుమారు 35 నుండి 40 మంది నిర్మాణ కార్మికులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు.