Dec 27,2020 11:53

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. పాదాలు ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..!

  • ఎత్తు మడమల చెప్పులు వాడకూడదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే సరి.
  • రాత్రిపూట పడుకొనే ముందు వ్యాజిలెన్‌ లేదా ఇతర చర్మక్రిములు పూసి కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రక్తం సరఫరా అయ్యి పగుళ్లు తగ్గుతాయి.
  • గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.
  • బకెట్‌లో రెండు చెంబుల గోరువెచ్చని నీరుపోసి రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌, ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అందులో పాదాలను ఉంచాలి. నీళ్ల వెచ్చదనం తగ్గాక పాదాలను బయటకు తీసి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
  • మడమలు, పాదాల వేళ్ల మధ్య సందుల్లో ఇలా అన్నిచోట్ల మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల నిర్జీవ కణాలు తొలిగిపోతాయి. పెరుగు, వెనిగర్‌ కలిపి మసాజ్‌ చేస్తే ఫలితం ఉంటుంది. పాదాలు కూడా మెత్తగా మారుతాయి.
  • చివరగా పాదాలకు వ్యాయామం తప్పనిసరి. పాదాలను నేలపై ఉంచి గుండ్రంగా ఒకవైపు ఐదారుసార్లు, మరోవైపు ఐదారుసార్లు తిప్పాలి. అలానే నేలమీద పెన్సిల్‌ ఉంచి పాదాల వేళ్ళతో పైకెత్తే విధంగా ప్రయత్నించాలి.