Oct 20,2023 15:10

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా శాలీందర్‌ కౌర్‌, రవీందర్‌ దుడేజాలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచేత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణం చేయించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల శాలిందర్‌ కౌర్‌, రవీందర్‌ దుడేజాల పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీం కొలీజియం సిఫార్సు మేరకు వీరికి పదోన్నతలి లభించింది. ఇక శాలిందర్‌ కౌర్‌ సెప్టెంబర్‌ 7 2025 వరకు ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తన పదవిలో కొనసాగనున్నారు. అలాగే రవీందర్‌ దుడేజా రెండేళ్లపాటు న్యాయమూర్తిగా కొనసాగున్నారు.