వెరీ ట్యాలెంటెడ్, అవార్డ్ విన్నింగ్ నటి నిత్యా మీనన్ ఈ సిరీస్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం కుమారి శ్రీమతి. ఈరోజు నేచురల్ స్టార్ నాని కుమారి శ్రీమతి ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ని బట్టి చూస్తే, కుమారి శ్రీమతి తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన మహిళ ప్రయాణం. నిత్యా మీనన్ ఈ తరానికి చెందిన ఆధునిక మహిళగా కనిపించింది. గౌతమి, నరేష్, తాళ్లూరి రామేశ్వరి, మురళీ మోహన్, ప్రణీత పట్నాయక్, తిరువీర్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సిరిస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్కి స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. 7-ఎపిసోడ్స్ ల సిరీస్ కు స్టాకాటో, కమ్రాన్ పాటలు అందించారు. మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్గా, సజన అడుసుమిల్లి ఎడిటర్గా పని చేశారు. చందు నిమ్మగడ్డ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి 'కుమారి శ్రీమతి' సెప్టెంబర్ 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది.










