న్యూఢిల్లీ : బి2బి వేదిక ఫ్లిప్కార్ట్ హోల్సేల్ తన సభ్యులకు పొదుపు, లాభాలను వేగవంతం చేసే లక్ష్యంతో 'వ్యాపారి దివస్'ను ప్రారంభించినట్లు తెలిపింది. ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 09 వరకు కొనసాగే ఈ క్యాంపెయిన్లో అన్ని విభాగాల్లో అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు తొలిసారి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ యాప్, ఇన్ స్టోర్ కొనుగోళ్లు రెండింటిపై సభ్యులకు రూ.9,999 వరకు హామీ ఇవ్వబడిన క్యాష్బ్యాక్ అందిస్తున్నామని ఫ్లిప్కార్ట్ హోల్సేల్ బిజినెస్ హెడ్ కోటేశ్వర్ ఎల్ఎన్ పేర్కొన్నారు.










