Jun 20,2023 21:13

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా ఆవిష్కరించిన గెలాక్సీ సీరిస్‌లో ఎఫ్‌54 5జి అమ్మకాలను ప్రారంభించినట్లు తెలిపింది. జూన్‌ 20 నుంచి ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లు, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. 108 ఎంపి కెమెరా, రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌, సాఫ్ట్‌వేర్‌ పొడిగింపు మద్దతు, 6.7 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ ప్రారంభ ధరను రూ.27,999గా నిర్ణయించినట్లు వెల్లడించింది.