Sep 13,2023 13:38

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ... మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విశాఖ ఎంవిపి కాలనీలోని ఆయన నివాసం వద్ద బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ... నీతికి నిజాయితీకి మారుపేరుగా ముఖ్యమంత్రి హౌదాలో 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివఅద్ధి పథంలో పరుగులు పెట్టించిన చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేయడం జగన్మోహన్‌ రెడ్డి అధికార దుర్వియోగానికి, పైశాచకత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గలిగిన ఒక గొప్ప దార్శనికుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్‌ భారతదేశం ముక్తకంఠంతో ఖండిస్తోందని తెలిపారు. చివరికి ధర్మమే గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు సచ్చీలురుగా విడుదలై, రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని గద్దె దించి గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. సైకో పాలనకు అంతిమ ఘడియలు వచ్చాయని, 2024లో సైకిల్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జనసేన నాయకురాలు శివలక్ష్మి, విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.