Nov 20,2023 09:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : క్రికెట్‌కు సైతం మతం రంగుపులిమి రాజకీయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో ఓటమి అనంతరం సిగ్గుపడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫైనల్స్‌లో ఇండియన్‌ క్రికెట్‌ జట్టు ఓడినా గట్టిగా పోరాడిందని కితాబిచ్చారు. క్రికెట్‌లో రాజకీయ పెత్తనం, బెట్టింగ్‌లను నివారిస్తే ఎలాంటి పోటీలోనైనా సునాయసంగా గెలిచే సత్తా ఇండియా జట్టు సొంతమని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ క్రీడను కేంద్రమే జూదంగా మార్చేసిందన్నారు.