Jun 09,2023 13:21

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (అంబేద్కర్‌ కోనసీమ) : ప్రతి నిత్యం గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుని వైద్య సలహాలు పాటించడం ద్వారా పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యవంతంగా ఉంటారని పీహెచ్సీ వైద్యాధికారులు డా.రత్నకుమారి, డా.ప్రియాంకలు అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతఅత్వ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ... శుక్రవారం కపిలేశ్వరపురం మండలంలోని అంగర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి స్త్రీలకు నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షల్లో వైద్యాధికారులు రత్నకుమారి, ప్రియాంక లు పి హెచ్‌ సి పరిధిలోని 25 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హైరిస్క్‌ గా 3 మంది గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు, లేబరేటరీ పరీక్షలు జరిపి వారికి మందులను అందజేశారు. అనంతరం గర్భిణీలు తీసుకోవలసిన పౌష్టికాహారం, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బి.రామారావు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్వైజర్‌ పి.సురేష్‌, టి.మేరీమణి, ఎంఎల్‌ హెచ్‌ పి కె రమా దేవి, స్టాఫ్‌ నర్స్‌ జి నవ్య , లాబ్‌ టెక్నీషియన్‌ ఆలీ, ఏఎన్‌ఎం లు, అంగనవాడి, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు.