Jul 13,2022 14:13

హైదరాబాద్‌ : సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఎం కేసీఆర్‌పై భజరంగ్‌ దళ్‌ నేతలు ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్‌ మాట్లాడారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నాయకులు సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారు. దీనిని రాజకీయంగా తప్పు పడుతూ జులై 10వ తేదీన నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బజరంగ్‌ దళ్‌ నాయకుడు అభిషేక్‌ డిమాండ్‌ చేశారు.