
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు కెనరా బ్యాంక్వారు విద్యా జ్యోతి ఉపకార వేతనం పథకం ద్వారా పిఎల్కే హైస్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ బాల వెంకట్ మాట్లాడుతూ ... బ్యాంక్ ద్వారా బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కెనరా విద్యా జ్యోతి ద్వారా 6-10 వ తరగతి వరకు క్లాస్ ఫస్ట్ వచ్చిన ఎస్సీ , ఎస్టీ విద్యార్థినిలకు ఇస్తున్నట్లు చెప్పారు. 6, 7 తరగతి వారికి 2,500 రూపాయలు చొప్పున, 8, 9, 10 వ తరగతి వారికి 5,000 రూపాయలు చొప్పున ఐదుగురికి అందజేశారు. బ్యాంక్ మేనేజర్ ఎస్.సాధన చెక్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం టి వెంకటలక్ష్మి, బిఆర్.అమర్ కుమార్, జివిఎస్.విఆర్.యం.మున్సిపల్ పాఠశాల హెచ్ఎం భవానీ ప్రసాద్ రాయపూడి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.