
ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల తాజా జాబితాను ఆస్కార్స్ కమిటీ ప్రకటించింది. అందులో మన దేశం నుంచి 10 సినిమాలు నిలిచాయి. 'ది ఛల్లో షో', 'ఆర్ఆర్ఆర్', 'కశ్మీరీ ఫైల్స్', 'కాంతార', 'విక్రాంత్ రోణ', 'గంగూభాయి కతియావాడి', 'మి వసంతరావ్', 'తుజ్యా సాథీ కహీ హై', 'రాకెట్రీ', 'ఇరవిన్ నిళల్' చిత్రాలు ఓపెన్ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డ్స్కు నామినేట్ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. తాజాగా రిషబ్శెట్టి నటించిన 'కాంతార' సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించిందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్లో పేర్కొంది.