Nov 10,2022 23:57

డ్యాన్స్‌ అకాడమినీ ప్రారంభిస్తున్న ఆదిలక్ష్మి

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మండలంలో నీలంపేటలో జి డాన్స్‌ అకాడమీని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆదిలక్ష్మి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత కళా రంగంలో రాణించాలన్నారు.డాన్స్‌లో పిల్లలు మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి, పట్టణ వైయస్సార్‌ పార్టీ ప్రెసిడెంట్‌ యాక శివ, అయ్యరక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కర్రి శీను, సంచార జాతుల డైరెక్టర్‌, నీలంపేట సర్పంచ్‌ గంట లలిత, డాన్స్‌ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.