Jul 24,2023 22:14

యువగళం పాదయాత్ర పాల్గొన్న రంజిత్‌కుమార్‌

కురుపాం: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం సంతనూతలపాడు నియోజకవర్గం మార్కాపురం వద్ద 163వ రోజుకు చేరుకున్న సందర్భంగా స్థానిక టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌ మర్యాదపూర్వక కలిసి ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారన్నారు. .