
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:అనేకమంది త్యాగ ఫలితంగా యుటిఎఫ్ ఆవిర్భావం అయ్యిందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు చెప్పారు. మండల కేంద్రంలో ఆదివారం యుటిఎఫ్ మండల నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుటిఎఫ్ ఒక ఆశయ సాధనకు స్థాపన జరిగిందన్నారు. అనంతరం నూతన మండల కార్యవర్గం ఎన్నికైంది. ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.నారాయణ అధ్యక్షతన ఎన్నికల అధికారి టి.చిట్టిబాబు సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా టి.సుబ్బారావు, అధ్యక్షుడిగా కాకారి రాజారావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.బాలకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహ అధ్యక్షులుగా ఎం రామకృష్ణ, సహధ్యక్షురాలిగా అర్.పార్వతి , కోశాధికారిగా ఎం.మోహన్, ప్రచార కార్యదర్శిగా ఆర్.మల్లికార్జునరావుతో పాటు కార్యదర్శులుగా జి.దుక్కు, కే.బాబ్జి, కే.ప్రసాద్, బి శ్రావణ్ కుమార్, ఏ.రాము, వి.కృష్ణ, సిపిఎస్ కమిటీ కన్వీనర్గా కె.గెన్ను, ఆడిట్ కమిటీగా టి కోటేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, టీ.మేఘనాథ్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్లు కే.రాజారావు, ఎస్.బాలకృష్ణ, ఎస్ కన్నయ్య, బాబురావు, నారాయణ పాల్గొన్నారు.
పెదబయలు: మండల యుటిఎఫ్ నూతన కార్యవర్గం స్థానిక ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కార్యదర్శి మోస్య, ధర్మారావు ఆధ్వర్యంలో ఎన్నికైంది. మండల స్థాయి అధ్యక్షులుగా గల్లెల సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిల్లో ఆనంద్, కార్యదర్శులుగా నిక్కుల శ్రీనుబాబు, కొర్ర వెంకటేష్, అడిట్ కమిటీ, జిల్లా కౌన్సిలర్స్గా జె సత్యనారాయణ, గుల్లెల ప్రసాద్, మహిళా కన్వీనర్స్ బాలకుమారి, సభ్యులుగా లక్ష్మీలు ఎన్నికయ్యారు.
అరకులోయ:మండల యుటిఎఫ్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికయింది. జిల్లా గౌరవ అధ్యక్షులు టి చిట్టిబాబు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి.దేముడు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మండల యూటీఎఫ్ నూతన గౌరవ అధ్యక్షులుగా టీ.మోహన్ రావు, అధ్యక్షులుగా టి.విజయరావు,ఉపాధ్యక్షులుగా రవికుమార్, జి.సింహాద్రి నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.రామచందర్, కోశాధి కారిగా ఎం.నాగేశ్వరావు, కార్యదర్శులుగా చంద్రశేఖర్, వి.శాంతి, మచ్చులమ్మ, ఎల్బీ కామేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీగా ఎం.శ్రీను, కే.సుబ్బారావు, బి.ముక్తా, జి మహాలక్ష్మి, జిల్లా కౌన్సిలర్గా ఎస్.నారాయణ, ఎస్.రాజ్ కుమార్లు ఎన్నికయ్యారు. సలహాదారులుగా యు.గంగరాజు, ఎస్.దుక్కు నాయుడు, ఎరుకులు, చంద్రమోహన్దాస్, సిపిఎస్ కమిటీలు సభ్యులుగా కుమారి, ఎస్.గంగాధర్, డి.రాజుబాబు, బి.గోపాల్, కె కాంతమ్మ, ఎన్నికయ్యారు.