Nov 19,2023 22:29

ప్రజాశక్తి-ఆలమూరు
యుటిఎఫ్‌ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించడం జరిగిందని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు వై.వి.వి.రమణ ఆదివారం తెలిపారు. మరొకసారి ఆలమూరు మండల శాఖ అధ్యక్షుడిగా అద్దరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జె.మనోజ్‌ కుమార్‌ ఎంపికయ్యారు. అలాగే మిగిలిన సభ్యులందరూ కూడా పాత కార్యవర్గమే ఎన్నుకొన్నారు. అయితే కొంతమంది బదిలీ మీద వెళ్లిన కారణంగా వారి స్థానంలో మండలానికి వచ్చినటువంటి వసంత్‌ ,ఆనంద్‌ లను కూడా కార్యవర్గంలో తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలమూరు మండల యుటిఎఫ్‌ శాఖ నూతన బిల్డింగు నిర్మించాలని మండల శాఖ తీర్మానిం చింది. అందుకు అనుగుణ ంగా కొంతమంది సభ్యులు విరాళాలు ప్రకటించగా వారందరికీ కూడా మండల శాఖ ప్రత్యేకమైన ధన్య వాదాలు తెలియజేసారు. అనంతరం మండల విద్యా శాఖ అధికారులు పి.సాలెంరాజు, పి.సుబ్బరాజు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి బస్‌, ఎన్నికాధికారి బాలాజీలను గౌరవించి సత్కరించారు. అలాగే సహకారాన్ని అందించిన ఈదర రమేష్‌ ,అఖిల దంపతులకు, జి.జె.పుత్రకుమార్‌ కు మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.