
ప్రజాశక్తి-యంత్రాంగం:
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్ ఆధ్వర్యాన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకులోయ, చింతూరులో నిరవధిక నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్ నేతలు నినాదాలు చేశారు.
పాడేరు:పాడేరులో శుక్రవారం నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విల్సన్ బాబు, మహేశ్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ కేంద్రంలో తలపెట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు బలవంతంగా తొలిగించి పోలీసులు స్టేషన్కు తరలించడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు.ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కదిలి వచ్చి భవిష్యత్తు పోరాటాల్లో సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.
సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ దీక్ష శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ,నూతన పెన్షన్ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అసోసియేట్ అధ్యక్షులు చీకటి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు రఘునాధ్, ధర్మారావు, దేముడు నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, యుటిఎఫ్ కార్యవర్గ సభ్యులు ఆంధ్రేయ, విశ్వరాజ్, కర్రిబాబు. నైని. కోండబాబు, సతీష్ కుమార్, లింగన్న, గోపి, ఆశా, అంగన్వాడీలు కోండమ్మ, మంగమ్మ, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
పలు ప్రజా సంఘాల మద్దతు
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాడేరు లో చేపట్టిన నిరవేదిక నిరాహార దీక్షకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ విద్యార్థి సంఘాలు సందర్శించి యుటిఎఫ్ నాయకులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె.రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కె.ప్రభుదాస్ విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పార్టీ అధికారంలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని మర్చిపొయారని విమర్శించారు.
ప్రజా క్షేత్రంలోని తేల్చుకుంటాం
అరకులోయరూరల్:ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాక్షేత్రంలోని తేల్చు కుంటామని యుటిఎఫ్ అల్లూరి ప్రధాన కార్యదర్శి ఎస్.బాలకృష్ణ తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నిరవధిక దీక్షను అరకువేలి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర యుటిఎఫ్ సీనియర్ నాయకులు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎస్ రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ దీక్షకు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం జిపిఎస్ తీసుకు వచ్చి తీవ్రంగా మోసం చేస్తుందన్నారు.పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ చేయాలన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను పరిష్కరించాలని ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ లేని జిపిఎస్ ఇస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు.సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు నాయకులను నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో టి.విజరు, ఎస్.కన్నయ్య, బాబ్జి, శ్రావణ్, మేఘనాథ్, దుక్కు, కోగేశ్వరరావు, నాగేశ్వరరావు, రామచంద్ర, ఎల్.జయరాం, ఎల్బీ రవి, పరమేష్, బీబీ విజరు, కె.సత్యనారాయణ, నారాయణ, జి నారాయణ, బి.సింహాచలం, ఎస్ బొంజు బాబు, కె పొన్నాలు, డి సోమ శేఖర్, జి.త్రినాథ్ అనంతగిరి, అరకువేలి డుంబ్రిగూడ మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
చింతూరు:నూతన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీయుటిఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చింతూరు కేంద్రంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఎం.కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ ఐటిడిఎ కన్వీనర్ యు.వెంకటనారాయణ మాట్లాడుతూ జిపిఎస్ విధానంలో పెన్షన్కు గ్యారెంటీ లేదన్నారు. నిరాహార దీక్షలకు సీఐటీయూ మండల కార్యదర్శి పి.లక్ష్మణ్ మద్దతు తెలిపారు. యుటిఎఫ్ నాయకులు సీతా, ఎం.నందిని, సిహెచ్ సత్యవతి దేవి, కే శాంతమ్మ, జయలక్ష్మి, కే రాజయ్య, టి సుబ్బారావు, జోగారావు, ఎం రాంబాబు, కే వీరయ్య, ముత్తయ్య, బి సావిత్రి రత్న రావు దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి కృష్ణయ్య, ఎస్ నాగేశ్వరరావు, కోనవరం చింతూరు, వీఆర్.పురం, ఎటపాక మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.