Aug 07,2021 07:25

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.