Oct 28,2023 12:01

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : వాల్మీకి జయంతిని పురస్కరించుకొని శనివారం కర్నూల్ నగరంలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి వెంకట లక్ష్మమ్మ అధ్యక్షత వహించగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఎమ్మెల్యే లు హఫీజ్ ఖాన్ సుధాకర్ మేయర్ బివై రామయ్య, వైసిపి వైద్య ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి సతీష్ కుమార్, పలువురు బీసీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.