ప్రజాశక్తి-ఆలూరు
హాలహర్వి మండలం నిట్రవట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా విద్యార్థులకు సోమవారం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు బేస్ బాల్, సాఫ్ట్ బాల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు ప్రోత్సాహకంగా గ్రామ యూత్ సభ్యులు వడ్డే గాదిలింగప్ప, హెచ్.బసవరాజు రూ.18 వేల విలువ చేసే క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్వి.నారాయణస్వామి, వ్యాయమ ఉపాధ్యాయులు జి.వీరన్న యూత్ సభ్యులను అభినందించారు.
రాష్ట్రస్థాయి సెపక్తక్ర పోటీలకు ఎంపిక : మండలంలోని హత్తిబెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సెపక్ తక్ర క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు బి.సుధాకర్, వ్యాయమ ఉపాధ్యాయులు చిన బాబు తెలిపారు. వారు మాట్లాడుతూ... ఈనెల 27న కర్నూలు ఇండోర్ స్టేడియంలో జరిగిన సెపక్ తక్ర పోటీల్లో ప్రతిభ కనబరిచిన 8వ తరగతి విద్యార్థులు కె.మానస, చాందిని, బాలుర విభాగంలో హెచ్.రియాజ్ ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనందున విద్యార్థులను ఉపాధ్యాయులు అబ్దుల్ సలాం, ఉషారాణి, ఆశా, సోమేశ్వరి, గౌతమి అభినందించారు.
విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేస్తున్న గ్రామ యూత్ సభ్యులు