Nov 03,2023 21:18

4వ వార్డు ఎంపిపి పాఠశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-ఆలూరు
రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన స్టేట్‌ ఎడ్యుకేషన్‌ సర్వేలో భాగంగా మండలంలో శుక్రవారం 3, 6, 9వ తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 4వ వార్డు ఎంపిపి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులు 30 మందికి లెక్కలు, తెలుగు సబ్జెక్టుల్లో ఒఎంఆర్‌ షీట్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జంబులింగయ్య మాట్లాడారు. ప్రతేడాది లాగానే శ్యాంపిల్‌ సర్వే పరీక్షలు రాసిన విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకొని అందుకనుగుణంగా పాఠ్యపుస్తకాలు మార్చడం, లేదా ఉపాధ్యాయులకు ట్రైనింగ్‌ ఇస్తారని తెలిపారు. మండలంలో 27 ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో 3, 6, 9వ తరగతుల్లో తరగతికి 30 మంది చొప్పున 810 మంది పరీక్షలు రాశారన్నారు. వీరికి డిగ్రీ చదివిన విద్యార్థులు 41 మంది ఇన్విజిరేటర్లుగా నియమించారన్నారు.