Aug 18,2023 22:23

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

విద్యార్థుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని ప్రభుత్వ, ప్రయియివేట్‌ పాఠశాలల్లో విద్యార్థి భౌతికంగా చదివే పాఠశాల హాజరు పట్టి ఆన్‌లైన్‌లో పేరు నమోదై ఉండాలని మండల విద్యాశాఖ అధికారులు షేక్‌ మస్తాన్‌ వలీ, తోట, శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రయివేట్‌ పాఠశాలలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి యాజమాన్యాలకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి తరగతినందు విద్యార్థులు భౌతికంగా ఏపాఠశాల్లో చదువుతున్నారో అపాఠశాల్లోని హాజరు పట్టీ చైల్డ్‌ ఇన్ఫో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదై ఉండాలన్నారు
. కొన్ని పాఠశాలల్లో విద్యార్థి హాజరై ఉన్నప్పటికీ విద్యార్థి వివరాలు హాజరు పట్టి ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదన్నారు. హెచ్‌ఎంలు చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేసి హాజరుపట్టీలో హాజరు వేయాలన్నారు. లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.