Jul 01,2023 19:57

వెంకట్‌ను సత్కరిస్తున్న ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి-కందుకూరు :దేశ వ్యాప్తంగా సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టిన కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామ యువ కుడు వెంకట్‌ దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డిని కలిశారు. కందుకూరు యువకుడు దేశవ్యాప్త సైకిల్‌ యాత్ర చేయడం గర్వంగా ఉందని వేంకట్‌ను ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి సత్కరించారు.