Feb 21,2023 23:18

ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి పోస్టర్‌ను విడుదల చేస్తున్న నూకరాజు తదితరులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసువెళ్లి ఎండ గట్టాలని కార్యకర్తలకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు పిలుపు నిచ్చారు. జివిఎంసి మూడో వార్డు అప్పికొండ వీధిలో ''ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి'' కార్యక్రమం నిర్వహించారు. పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ, వైసిపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రతి పక్షాల గొంతు నొక్కుతుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎ.నూకరాజు, నరసింగరావు, శ్రీను, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.