Nov 04,2023 17:18

చెక్కును అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
వైఎస్‌ఆర్‌ బీమా నిరుపేద కుటుంబాలకు ఆసరా అని సర్పంచి తెల్లబండ్ల భీమయ్య తెలిపారు. రాఘవేంద్ర నగర్‌ కాలనీకి చెందిన గార్లదిన్నె నాగప్ప కోడలు గార్లదిన్నె లక్ష్మి శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచి భీమయ్య వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద తక్షణ సహాయం రూ.10 వేలు అందజేశారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, వెల్ఫేర్‌ అనిత, వాలంటీర్‌ దస్తగిరమ్మ మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు నగదు అందించారు. మిగిలిన నగదును నామినీ ఖాతాలో జమ చేస్తామని సర్పంచి భీమయ్య తెలిపారు. అంతకు ముందు సర్పంచి భీమయ్య గార్లదిన్నె లక్ష్మి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపిటిసి గోసిభట్ల వీరేష్‌, వార్డు సభ్యులు మిడిగిలిదిన్నె రామాంజనేయులు ఉన్నారు.