Jan 13,2023 00:16

శ్మశాన గోడ పనులను పర్యవేక్షిస్తున్న బర్కత్‌ అలీ

ప్రజాశక్తి- కంచరపాలెం : వార్డులో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని 53వ వార్డు కార్పొరేటర్‌ బర్కత్‌ అలీ అన్నారు. వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురువారం ఆయన పర్యవేక్షించారు. ముఖ్యంగా వార్డు పరిధి నరేంద్రనగర్‌లో శ్మశాన వాటిక గోడ నిర్మాణ పనులను పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, వార్డు పరిధిలో ప్రధానమైన సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. భారీ తుపాన్‌ కారణంగా కూలిన శ్మశాన వాటిక ప్రహరీపై స్థానికుల విజ్ఞప్తి సుమారు రూ.44 లక్షలు జివిఎంసి నిధులను వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా సుమారు రూ.3 కోట్లు వార్డు అభింౠద్ధికి ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.