Oct 21,2023 23:47

వాలీవాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి తదితరులు

ప్రజాశక్తి-విఆర్‌ పురం
మండలంలోని కుంజవారి గూడెం గ్రామంలో కొమరం భీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఎంపీపీ కారం లక్ష్మి, ఏఎస్‌డిఎస్‌ సంస్థ ముఖ్య అధిపతి వి.గాంధీబాబు, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా వాలీబాల్‌ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఇటువంటి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన భాధ్యత తల్లిదండ్రులకు వుందన్నారు వాలీబాల్‌ పోటీలో నాలుగు మండలాల నుండి40 టీములు పాల్గొంటున్నాయని, క్రీడలు రెండు రోజులు జరుగుతాయని పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.20వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు అందిస్తున్నట్లు తెలిపారు. గెలుపు ఓటమి సహజమేనని గెలిపిన వారికి బహుమతులు ఉంటాయని ఎంపిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవ్వ సుజాత, మాజీ ఎంపీటీసీ అజ్జమ్మ, క్రీడాకారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.