
ప్రజాశక్తి-యంత్రాంగం
ఈ నెల 17 నుంచి 22 వరకు బెంగళూరులో జరిగే సిఐటియు అఖిల భారత 17వ మహాసభ జయప్రదం కోరుతూ విశాఖ జిల్లాలో పలుచోట్ల సిఐటియు పతాకాలను ఆవిష్కరించారు. కార్మిక వాడల్లో, పరిశ్రమల ప్రాంతాల్లో ఎర్రజెండాలు మంగళవారం రెపరెపలాడాయి.
కలెక్టరేట్ : సిఐటియు అఖిల భారత మహాసభల్లో కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జగదాంబ వద్దగల సంఘం జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు కె.స్వతంత్రకుమార్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం కుమార్ మాట్లాడారు. మహాసభల ప్రాధాన్యతను తెలియజేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో మోడీ కార్పొరేట్ విధానాలను ఓడించే విధంగా పోరాటాలు జరుపుతామన్నారు. ఏప్రిల్ 5న సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్తాధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.మణి, బి.జగన్, ఎం.సుబ్బారావు, వై.రాజు, జి.పోలేశ్వరరావు, కెవిపి చంద్రమౌళి, టి.నూకరాజు పాల్గొన్నారు.
పెందుర్తి : పెందుర్తి సిఐటియు కార్యాలయంలో సిఐటియు నాయకులు శంకరరావు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు
వేపగుంట : సింహాచలంలో సిఐటియు గోపాలపట్నం జోన్ కార్యదర్శి సత్యనారాయణ, కొత్తరోడ్ల అనసూయ, గోపాలపట్నంలో ఉపాధ్యక్షులు బి.వెంకట్రావు పతాకావిష్కరణలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.వరప్రసాద్, బాలు, వెంకటరమణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక: భెల్ యూనిట్లో సిఐటియు నాయకులు పి.కనకారావు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ భెల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి వి.బాబూరావు, కె.విజరుకుమార్, ఎస్.అప్పారావు, ఎస్.జగన్నాథరావు, కె.పవన్కుమార్, జి.రాంబాబు పాల్గొన్నారు.
పాత గాజువాక సెంటర్లో, గాజువాక, మిందిలోని సిఐటియు కార్యాలయాల్లో యూనియన్ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు ఎ.లోకేష్, ఎం.రాంబాబు, జి.సుబ్బారావు, కె.కిరీటం, గొలగాని అప్పారావు, సిహెచ్ అప్పలరాజు, గోపాలరావు, దేవుడు పాల్గొన్నారు.
మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధి ద్రోణంరాజు కల్యాణ మండపంలో సిఐటియు నాయకులు బి.రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి పి.రాజ్కుమార్, డి.అప్పలరాజు, కె.రాజు, కె.గోవిందు, యు.ఆదిలక్ష్మి, ఆర్.రవి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : ఉక్కు బీసీ గేటు వద్ద కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఒవి.రావు, జి.శ్రీనివాస్, యు సోమేష్, పి.మసేను, కె.సత్యవతి ఎన్.చంద్రరావు, సింహాచలం, సోమునాయుడు, కె.మహేష్, పైడిరాజు, ముసలయ్య, వరహాలు, చట్టి నర్సింగరావు, నమ్మి దేవుడు, ముసలయ్య, వివి.రమణ, ఎ.రమణ, ఎం.మాణిక్యం, కాసులు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.