ఏలూరు టౌన్: ఉపాధ్యాయుల సర్దుబాటును నిలుపుదల చేయాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు పిబివిఎల్ఎన్. నారాయణ, సెక్రటరీ జనరల్ జి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర పరిశీలకులు, కోచైర్మన్లు బి.మనోహర్, కె.నరహరి, ఏలూరు కో ఛైర్మన్లు ఆదినారాయణ, ఎమ్డి.జిలాని, డిప్యూటీ సెక్రటరీ జనరల్ పివి.నరసింహారావు పాల్గొన్నారు.










