ప్రజాశక్తి- దేవనకొండ
విద్యా, ఉపాధి అవకాశాలపై డివైఎఫ్ఐ చేసే ఉద్యమాల్లో యువత కలిసి రావాలని వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీర శేఖర్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు కోరారు. శుక్రవారం దేవనకొండలోని బస్టాండ్లో డివైఎఫ్ఐ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు పెదరాయుడు పతాకాన్ని ఆవిష్కరించారు. డివైఎఫ్ఐ మండల నాయకులు వీరేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ అటకెక్కిందని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్లో కోత పెడుతున్నారని తెలిపారు. ఉపాధి కరువై యువత సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతేడాది జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారని విమర్శించారు. రైతుసంఘం, సిఐటియు మండల కార్యదర్శులు సూరి, అశోక్, ప్రజాసంఘాల నాయకులు నాగేష్, యూసుఫ్, శ్రీరాములు, డివైఎఫ్ఐ మండల నాయకులు రసూల్, మహేంద్ర, రాముడు, నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న శ్రీనివాసులు