ఎమ్మిగనూరులో జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరులో యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ఉద్యమించాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ కోరారు. శుక్రవారం డివైఎఫ్ఐ పట్టణ నాయకులు అజిత్ అధ్యక్షతన డివైఎఫ్ఐ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం డివైఎఫ్ఐ పట్టణ నాయకులు వీరేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. పట్టణంలో చాలా ప్రాంతాలు రోడ్డు, విద్యుత్, కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఇంట్లో చదువుకున్న యువత ఉన్నప్పటికీ ఉపాధి లేక తల్లిదండ్రులకు భారంగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరేష్ బాబు, వీరేష్, చిన్న, నరసప్ప, వీరేష్, నరసింహ, నరేష్, హరి, రాము, రవి పాల్గొన్నారు.