Nov 21,2023 19:50

మందులు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్‌ :ఏక్తా యాంటీ కరెప్షన్‌ ఆల్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ సెక్రటరీ కె అబ్దుల్‌ రహెమాన్‌ జిల్లాకు వివిధ రకాల మందులు సరఫరా చేశారు. వాటిని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మహబూబ్‌ బాషా, సెక్రటరీ జి మోహన్‌ ఆధ్వర్యంలో చాణిక్యపురి మసీద్‌ సెంటర్‌లో వైద్యుల సమక్షంలో 300 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్‌ మాదాల రాజేష్‌ (చిల్డన్‌ స్పెషలిస్ట్‌,) డాక్టర్‌ మారం సుధాకర్‌ సమక్షంలో మందులను ఉచితంగా అందజేశారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.