కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు కీలక మలుపులు తిరుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటికే గులాబీ గూటికి చేరిన యువనేత పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలనేలా నిర్ణయం తీసుకోవడం ఇక్కడి రాజకీయాల్ని మరింత రసవత్తరంగా మారుస్తోంది. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్కు సిఫారసు చేశారు. త్వరలోనే కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రాబోతుండటంతో పార్టీ శ్రేణులతో పాటు ఆయన అనుచరగణంలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గత నెల 21న కాంగ్రెస్ పార్టీని వీడిన పాడి కౌశిక్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ యువ నాయకుడు పాడి కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్తును రాజకీయంగా అందిస్తామని ప్రకటన చేశారు. ఇందుకు తగినట్లు పక్షం రోజుల వ్యవధిలోనే ఆయన్ను ఎమ్మెల్సీగా చేసే పనిలో ఉన్నారు.