Jul 31,2021 17:58

టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్‌ తగిలింది. 69-75 కిలోల మహిళల బాక్సింగ్‌ బౌట్‌లో పూజా రాణి ఓటమిపాలైంది. క్వార్టర్స్‌లో చైనా బాక్సర్‌ లీ క్వియాన్‌ చేతిలో 5-0 తేడాతో పూజా మ్యాచ్‌ను చేజార్చుకుంది. చైనా బాక్సర్‌ లీ మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్‌లతో పూజాను కోలుకోకుండా చేసింది. పూజా రాణి మరీ పేలవమైన ఆటను ఆడింది. ఎక్కడా అటాక్‌ చేసినట్లు కనిపించలేదు. అంతకుముందు ఇండియాకు బాక్సింగ్‌లో కచ్చితంగా మెడల్‌ తీసుకొస్తాడనుకున్న స్టార్‌ బాక్సర్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ అమిత్‌ పంఘాల్‌ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే.