Oct 08,2023 00:48

సంతలో నిలిచిన ఆటోలు

ప్రజాశక్తి- ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య వీడటం లేదు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం జరిగిన వారపు సంతలో రహదారికి ఇరువైపులా అడ్డంగా వాహనాల నిలుపుదల చేయడంతో మరింత ట్రాఫిక్‌ జఠిలమైంది. ఒరిస్సా, మైదాన ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారుల వాహన రహదారులు ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా, అడ్డదిడ్డంగా నిలిపి వేయడంతో వారపు సంత రోజున మరింత ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడడమే కాకుండా 108, 104 అత్యవసర వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. పాదచారుల సైతం రోడ్డు దాటలేని పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు, పాదచారులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.