బోల్తా పడిన ట్రాక్టర్
ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని కంబాలదిన్నె గ్రామం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. శనివారం రచ్చమర్రి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాగేంద్ర, రమేష్, తిమ్మప్ప, సోమప్ప, ఆంజనేయలు పశుగ్రాసం కోసం బనవాసి గ్రామానికి చేరుకున్నారు. బనవాసి గ్రామం నుంచి డాక్టర్లో పశుగ్రాసం లోడు చేసుకుని తమ సొంత గ్రామానికి బయల్దేరారు. కంబాలదిన్నె గ్రామ ప్రధాన రహదారి గుంతలమయంగా ఉండడంతో ఒక్కసారి వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్ నాగేంద్ర అప్రమత్తంగా ఉండడంతో పైన కూర్చున్న నలుగురు కిందికి దూకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ప్రాణ నష్టం కలుగలేదు. ప్రధాన రహదారిలో ప్రయాణికులకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది.