Aug 01,2021 19:14

కాబూల్‌ : కంధర్‌ ప్రావిన్స్‌లోని జెరారు జిల్లాలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. గత 24 గంటల్లో అనేక ప్రధాన నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది ఉగ్రవాదులు మరణించగా.. దాదాపు 100 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా తాబిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో ఆక్రమించుకున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కీలక సరిహద్దు క్రాసింగ్‌లను స్వాధీనం చేసున్నారు. ఆ తరువాత తాలిబన్లు ఉండే ప్రావిన్షియల్‌ రాజధానులను ముట్టడించారు. ప్రస్తుతం హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని లష్కర్‌ గాహ్‌ దగ్గరగా రెండు వేర్వేరు ప్రావిన్షియల్‌ రాజధానులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక శనివారం రాత్రి కంధర్‌లోని విమానాశ్రయాన్ని కాపాడుకోవడానికి ఆ విమానాశ్రయం నుంచి మూడు రాకెట్లను ప్రయోగించారు.