మాట్లాడుతున్న కమిషనర్
ప్రజాశక్తి-నెల్లూరు :నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని లే అవుట్లలో టిడ్కో ఇళ్ల ప్లాట్ల మీద సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కమిషనర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ రుణాలు మంజూరుకు మెప్మా విభాగానికి పలు సూచనలు జారీ చేశారు. బ్యాంకు లోన్ కు అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరును సులభతరం చేయాలని సూచించారు. టిడ్కో ఈ.ఈ., డీ .ఈ.ఈ.హౌసింగ్ విబాగ సిబ్బంది, లు, మెప్మా విభాగం పీడీలు ఉన్నారు.










