
ప్రజాశక్తి -హుకుంపేట: మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు తులసీరావు ఆధ్వర్యంలో కళ్ళు తెరిపిద్ధాం నిరసన కార్యక్రమం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగానే కక్ష పూరితంగాగా చంద్రబాబుని జైలు లో పెట్టారని తెలిపారు.ప్రభుత్వం ప్రజల పరిపాలన విధానంపై దృష్టి సారించకుండా ప్రతిపక్షాలపై దృష్టి సారించడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులపై నిర్భందాలు, అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సూర్యకాంతం, ఎంపీటీసీ కొమ్మ రమ, సర్పంచులు వెంకట రమణ రాజు, పాండు రంగ స్వామి, క్లస్టర్ ఇంచార్జీ మురళి, వార్డు సభ్యులు లక్ష్మి నారాయణ, ఎస్టీ సెల్ సభ్యులు శంకర్, మాజీ సర్పంచ్ రామలింగం, టీడీపీ నాయకులు బాబురావు, కొేండలరావు, కోటి స్వామి, వికాస్, ప్రసాద్ పాల్గొన్నారు.