Oct 27,2023 00:24

మాట్లాడుతున్న శ్రవణ్‌కుమార్‌

ప్రజాశక్తి-పెదబయలు:చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మండలంలో లక్ష్మీపేట పంచాయతీ కేంద్రంలో బాబుతో నేను కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇంచార్జి, మాజీ మంత్రి కిడారి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, జగన్‌ మోహన్‌ రెడ్డి 16 నెలలు జైలు శిక్ష అనుభవించారని, మిగతా వారిని కూడా జైలుకు పంపించాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడుకి అవినీతి మరకలు అంటించారన్నారు. తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న జనాధారణ చూసి ఓర్వ లేక వైసిపి కుట్రలు పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఆర్గనైజర్‌ కార్యదర్శి సాగర సుబ్బారావు, మాజీ సర్పంచ్‌ ఎన్‌ ప్రసాద్‌, దారేలా సర్పంచ్‌ పాంగి పాండు రంగస్వామి, నాయకులు బత్తిరి రామారావు, కిషోర్‌ లైకోన్‌, త్రినాద్‌, మురళి పాల్గొన్నారు