
నిరసన చేపడుతున్న నేతలు
ప్రజాశక్తి- చింతపల్లి: చంద్రబాబు నాయుడును కక్షపూరిత కేసులతో ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య అన్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా తాజంగి పంచాయతీలోని బాసంగి కొత్తూరు గ్రామంలో ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నైపుణ్య శిక్షణ ఇప్పించి వందలాది కుటుంబాలలో వెలుగులు నింపిన చంద్రబాబు నాయుడును నిరాధారమైన ఆరోపణలతో కక్షపూరితంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పొత్తూరు రామ్మూర్తి, బోనంగి బంగారు పడాలు, రాజేష్, రామారావు, మధ్య రాజు బాబు, బోనంగి బెన్న లింగేశ్వరరావు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.