ప్రజాశక్తి - చిప్పగిరి
వచ్చే 2024లో టిడిపి అధికారంలోకి రావడం తథ్యమని టిడిపి ఆలూరు మాజీ ఇన్ఛార్జీ వీరభద్ర గౌడ్ తెలిపారు. గురువారం చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకులు నేమకల్లు మేకల రవి సోదరుని కుమార్తె వివాహానికి మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైసిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, టిడిపి మాజీ ఇన్ఛార్జీ వీరభద్ర గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వీరభద్ర గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక వెనుకబడిందని, చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అక్రమ కేసుల్లో చంద్రబాబును జైలులో పెట్టించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ప్రజలు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. టిడిపి నాయకులు లాయర్ షేక్షావలీ, పాముల సన్నప్ప, భోగేష్, జనార్ధన్ స్వామి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వివాహ వేడుకలో పాల్గొన్న వీరభద్ర గౌడ్