Aug 10,2021 06:50

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర, నైరుతి గాలులు కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.