Jul 30,2021 13:46

తాడిపత్రి (అనంతపురం) : తాడిపత్రిలో రెండో వైస్‌ చైర్మన్‌గా టిడిపి అభ్యర్థి జెసి ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని సాధించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెండవ వైస్‌ చైర్మన్‌గా పాతకోట బంగారు మునిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టిడిపి కి 18, వైసిపి కి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సిపిఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ టిడిపి కే మద్దతు ఇచ్చారు. దీంతో టిడిపి బలం 20 కి పెరిగింది. వైసిపి కి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18 కి చేరింది. వైసిపి గైర్హాజరుతో ఎలాంటి నెంబర్‌ గేమ్‌ లేకుండానే టిడిపి మద్దతుదారే వైస్‌ చైర్మన్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క మున్సిపాల్టీలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వేళ... జెసి, పెద్దారెడ్డి ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది. తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అన్న అంచనాలు కనిపించాయి. కానీ వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు వైసిపి గైర్హాజరు కావడంతో టిడిపి ఖాతాలో పడింది. దాంతో టిడిపి కే ఆ పదవి కూడా దక్కింది.