Feb 20,2023 23:18

తారకరత్న చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : నందమూరి తారకరత్న మృతి టిడిపికి తీరని లోటని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూక రాజు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ, టిడిపి క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామి కావాలనుకున్న సమయంలో తారకరత్న మృతి అత్యంత బాధాకరమన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కార్పొరేటర్‌ గంటా అప్పలకొండ, టిడిపి నాయకులు సిహెచ్‌ రమణ, కాసరపు నాగరాజు, ఎం.సంజీవకుమార్‌, వియ్యపు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస : జివిఎంసి ఒకటో వార్డు నాయకులు సోమవారం సాయంత్రం తగరపువలసలో తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షులు టి.సూరిబాబు, తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద, మాజీ కౌన్సిలర్‌ చిలకా నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.