Jan 21,2023 23:31

తాగునీటి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -మధురవాడ : జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని శారదానగర్‌, అయ్యప్పనగర్‌, ముత్యాలమ్మకాలనీ, గాంధీ నగర్‌లో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1.2 కోట్లుతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీటి సరఫరా పైపుల మరమ్మతులకు, ముత్యాలమ్మ కాలనీ, గాంధీ నగరంలో నూతనంగా తాగునిటీ సరఫరా పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. గతంలో గడపగడప కార్యక్రమంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొండవాలు ప్రాంతాల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, అందులో తాగునిటీ సమస్యను ప్రధానంగా గుర్తించి పనులు చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత, మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతరావు, టిడిపి నాయకుడు మొల్లి లక్ష్మణరావు, 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు, పోతిన సురేష్‌, బాబ్జి, అప్పన్న, సంజీవ్‌, రజని జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.