ప్రజాశక్తి-తిరుపతి : నాగలాపురం మండలం బీరకుప్పంలో రోడ్డు మరమ్మత్తు చేయాలని రోడ్డుపై బైఠాయించి యువకులు ధర్నా చేశారు. నాగలాపురం - టీపీ కోట రోడ్డు విస్తరణ కోసం మూడేళ్ల క్రితం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయినా ఇప్పటికి పనులు ప్రారంభం కాలేదు. 20 కిలోమీటర్ల మేర రోడంత గుంతలు పడి ఉంది. అసహనంతో యువత రోడ్డెక్కిన్నారు. వీరితో పాటు ఆ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం రోడ్డెక్కి ధర్నాలో పాల్గొనడం విశేషం.










