
ప్రతిభ చాటిన సూర్యారావు
ప్రజాశక్తి-హుకుంపేట:స్థానిక హుకుంపేట గ్రామ పంచాయతీకి చెందిన కొండపల్లి సూర్యారావు తైక్వాండో పోటీల్లో ప్రతిభ చాటాడు. ఈనెల 5వ తేది నుండి 8వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్, నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్న కొండపల్లి సూర్యారావు రజితం పతకం సాధించారు. పలు రకాల ప్రశంస పత్రాలు పొందారు. సూర్యారావును ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నైని సత్తిబాబు, బాకురు ఎంపీటీసీ రజిని, వార్డు సభ్యులు కొర్రా నాగరాజు అభినందించారు.